7, జులై 2011, గురువారం

దేవుడి పేర్లు పిల్లలకు పెట్టే ఆచారం ఎలా వచ్చింది!?

పిల్లలకు భగవంతుని నామాలు పెట్టడం సహజం. కానీ దేవుళ్ల పేర్లను పిల్లలకు పెట్టడం వెనుక పరమార్ధం దాగి వుంది. రాముడు, కృష్ణుడు, శివుడు.. ఇవన్నీ భగవంతుని నామాలు. ఈ నామాలు వచ్చేలా పిల్లలకు పేర్లు పెడతారు. ఆ పేర్లతో పిల్లలను పిలుచుకుంటే భగవన్నామస్మరణ చేసినట్టవుతుందని విశ్వాసం. 

భగవంతుడి నామానికి అంత శక్తి వుందా.? అని అడిగితే ఉందని వాగ్గేయకారుడు త్యాగరాజు అన్నారు. "రామ"లోని "మ" అనే అక్షరం పంచాక్షరి మంత్రం. ఆ అక్షరానికి "రా" అనేది చేరినప్పుడు, అది ఒక దివ్యమైనటువంటి మంత్రమవుతుంది. ఆ విషయాన్ని గమనించినందుకే శ్రీరామునికి ఆ పేరు పెట్టారు. ఆ పేరుని ఉచ్చరించటమే మంత్రం పఠించటమే. 

అలా మంత్రం పఠించి, దానివల్ల కలిగే సత్ఫలితాలను పొందటం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి వారి వారి పిల్లలకు రాముడని, కృష్ణుడని పేర్లు పెడతారు. ఆ పేర్లతో పిల్లను పిలుచుకుంటూ, భగవన్నామస్మరణ వల్ల కలిగే లాభాన్ని పొందుతారు. ఈ నమ్మకంతోనే దేవుడి పేర్లు పిల్లలకు పెట్టే ఆచారం ఏర్పడిందని పురోహితులు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి