12, జులై 2011, మంగళవారం

గాయత్రి మంత్ర అంతరార్ధం

గాయత్రి మంత్ర అంతరార్ధం
gayatriఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం...భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌ న గాయత్య్రాః పరం మంత్రం నమాతు: పరదైవతం అన్నది జగత్ప్రసిద్ధమయిన వచనం ఈ గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లి ని మించిన దైవం లేదు. ఆదిశంకరాచార్యులు తమ భాష్యంలో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ అని పేర్కొన్నారు. గయలు అంటే ప్రాణములు అని అర్ధం. అ లాగే త్రాయతే అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయ త్రి మంత్రమని శంకర భాష్యం.ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్క గా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ.

రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రా క్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వి తమెనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుం ది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన. ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం ఇలా చెబుతారు.

ఓం - భగవంతుడు సర్వ రక్షకుడు.
భూర్‌ - ఉనికి కలిగినవాడు
భువః - జ్ఞాన రూపుడు
స్వః - ఆనంద స్వరూపుడు అంటే దుఖః రహితుడు
తత్‌ - అటువంటి లక్షణాలు కలిగిన పరమేశ్వరుడు
సవితు - ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త
వరేణ్యం - అందరితో ఆరాధింపబడేవాడు
భర్గః - పరిశుద్ధుడు
దేవస్యః - ఆవిధమయిన దివ్య గుణములు కలిగిన దైవ స్వరూపుడు
ధీమహి - ఆత్మలో ఏకమయిన
ధియః - ఆ పరమేశ్వరుడు
‚నః - మా బుద్ధులను
ప్రచోదయాత్‌ -సత్కర్మలలో ప్రేరేపించి శ్రేయస్సు పొందేవిదంగా సమర్ధులను చేయుగాక.ఇక మూలార్ధం తీసుకుంటే దాని భావం ఇలా వుంటుంది.ఓ భగవాన్‌!ఏకకాలంలో సమస్త ప్రదేశాలలో వుండగలిగిన ఓ విశ్వరూపీ! అపరిమితమయిన శక్తికలిగిన ధీశాలీ! పరమేశ్వరా!ఈ చరాచర ప్రపంచంలో లభ్యమయ్యే సమస్త జ్ఞానం నువ్వే. సర్వ ప్రకాశానివి నువ్వే. వర్రపదాతవు నువ్వే. మాలో భయాన్ని పోగొట్టేది నువ్వే. ఈ విశ్వానికి సృష్టికర్తవు నువ్వే. సర్వోత్తముడివి నువ్వే. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ము. మా మనస్సు, మేధస్సు సత్కర్మలవైపు ఆకర్షించబడేలా చూస్తూ సన్మార్గంలో నడిచేలా మాకు మార్గం చూపు.గాయత్రి మంత్రాన్ని శాస్ర్తీయ కోణం నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదా యిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్ర్తీయ ప్రా ధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి.ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాల పుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవ యిన లక్షల నక్షత్రాలు వున్నాయి.

ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్ష త్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడి తో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుం బంలోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్థానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్‌ ల ల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతు న్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్ర్తీయ కోణం నుంచి పరిశీలిద్దాం. ఓం భూర్భు వస్వః - భూర్‌ అంటే భూమి, భువః అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రా లతో కూడిన పాలపుంత (గెలాక్సీ)

ఇక్కడ ఓ చిన్న వివరణ మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్‌ ఫాన్‌ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతా యి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతు లేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుం దన్నది ఊహాతీతం.గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః అనే ఈ బీజాక్షరాలు ఈ చరా చర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓం కారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి.

సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునుల కు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వా రందరూ కలసి ఈ ధ్వనికి ఓం అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.కాబట్టి నిరాకారుడు, నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరి గిందని విశ్వాసుల నమ్మకం. అప్పటి దాకా భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.

గీతాకారుడు కూడా అదే చెప్పాడు. ఓం ఏకాక్షరం బ్రహ్మ అం టే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం. అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టా రు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట. ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటం టే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరి భ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి కైనెటిక్‌ ఎనర్జీని ఉత్పత్తి చేస్తు న్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వంలోని గ్రహరాసుల న్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతు ల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తి చేసే ఎనర్జీకి స్టోర్‌ హౌస్‌ వంటిదన్నమాట.

తత్స వితుర్వరేణ్యం...తత్‌ అంటే ఆ (భగవంతుడు) సవితుర్‌ అంటే సూర్యుడు (న త్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగి వుండడం. ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే ఫలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలియడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడి ని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వా మిత్ర మహర్షి వాక్రుచ్చాడు.ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్ష త్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయి న భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.ఇది ఎలా అంటే- ఒక గణిత శాస్తజ్ఞ్రుడు 2+2=4; =2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్‌ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు. విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే.

గాయత్రి మంత్రంలోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు. భర్గో దేవస్య ధీమహిభర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం. అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారు డయిన భగవంతుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ దేవుడిని పూ జించాలని కూడా ఆయన చెప్పారు.ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పు డూ చంచలంగా వుండే మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు. దియోయోనః ప్రచోదయాత్‌ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్ర చోదయాత్‌ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగ వంతుడా! సరయిన మార్గంలో నడిచే విధంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.

ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్ర్తీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.భూమి(భుర్‌) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమిత మయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయి న భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్‌) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్‌) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు.కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో)ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనా దంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్‌) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.
ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః రిగ్వేద(అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి