భక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2012, శుక్రవారం

ఉగాది రోజున దీపారాధనకు ఆవునెయ్యిని వాడండి!


ఉగాది మనకు సంవత్సరాది. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తానలేచి, అభ్యంగన స్నానం చేయడం అతిముఖ్యమైన విధి. ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులూ దేవిని ఆరాధిస్తారు. అభ్యంగన స్నానం తర్వాత నూతన వస్త్రధారణ, భగవత్పూజ పంచాగ శ్రవణం, ఉగాది పచ్చడి భక్షణం మంచిది.

అలాగే ఉగాది రోజున అభ్యంగన స్నానానికి అనంతరం పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. మీకు నచ్చిన లేదా ఇష్టదేవతా పూజ చేసుకోవచ్చు. పూజకు ఉగాది పచ్చడి నైవేద్యం, పసుపు రంగులు పుష్పాలు వాడాలి. ఉగాది పండుగ రోజున ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు పూజ చేయవచ్చు. దీపారాధనకు రెండు ప్లస్ రెండు దూది వత్తులు, ఆవునెయ్యి వాడాలి. 

అలాగే ఉగాది నాడు ఇంతకుముందు చూడని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మంచిది. ఆలయాల్లో వసంతనవరాత్ర ఉత్సవములు నిర్వహించడం, లేదా మీ శక్తి చేయించగలిగే పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

ఉగాది నాడు శ్రీమద్రామాయణ పారాయణం చేయండి!



Rama
చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఏ రోజున వుంటే ఆ రోజున ఉగాది పండుగ పరిగణిస్తారు. ఇంకా బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున శ్రీరామునిని ఆరాధించడంతో పాటు శక్తి ఆరాధనకు కూడా విశిష్టమని పురోహితులు చెబుతున్నారు. 

అలాంటి ఉగాది పండుగ రోజున శ్రీరామ చంద్రమూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. ఇంకా శ్రీరాముని ఆరాధన, శ్రీ మద్రామాయణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.

ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకుని, నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయండి. తిలకధారణ, నూతన వస్త్రాల ధారణ అనంతరం భగవంతుడిని పూజించాలి. పూజానంతరం పెద్దల ఆశీస్సులను పొందడం, దేవాలయ సందర్శనం చేస్తే పుణ్యఫలములు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

16, మార్చి 2012, శుక్రవారం

బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా!?





God Shiva
శివునికి ప్రీతిపాత్రమైన బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా..! తెలియనట్లైతే ఈ కథనం చదవండి. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. 

మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?" అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు.

అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది. అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు, లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. 

గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి.

అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!!' అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి. శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది.

అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, "తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి" అని దీవించాడు. ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది.

22, ఫిబ్రవరి 2012, బుధవారం

పంచభూతాలే ప్రత్యక్ష దైవాలు..!

praying-handsపరమాత్ముడు జీవరాశులను సృష్టించడానికి ముందే పంచభూతా లను (ఆకాశం, భూమి, అగ్ని, వాయు, నీరు) సృష్టించాడు. ఒక్కో భూతాన్ని రెండు భాగాలుగా విడదీసి, వాటిలో రెండవ అర్ధభాగాలను నాలుగేసి భాగాలు చేశాడు. ఆ నాలుగు భాగాలను మిగిలిన నాలుగు భూత భాగాలలో కలిపాడు. ఇలా అన్ని భూతాలను కలుపగా ఒక్కొక్క భూతంలో దాని భాగం సగం కాగా మిగిలిన సగ భాగంలో నాలుగు భూతాలు కలిసి ఉంటాయి. అంటే ప్రతి భూతంలోను ఎనిమిది భాగాల లో నాలుగు భాగాలు తన అంశ కలిగి మిగిలిన నాలుగు భాగాలు పం చభూతాలలోని ఇతర భూతాలు అయివుంటాయి.

అందుకే ప్రతి వస్తువులోను ఇతర వస్తువుల లక్షణాలు అంతో ఇంతో ఉన్నాయని పెద్దలు చెప్తారు. భూమిలో సగ భాగం భూమి అయితే మిగి లిన సగ భాగంలో నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్ని కలిసి ఉంటాయి. అలాగే మిగిలిన భూతాల్లో కూడా. ఎండమావిలో నీరున్నట్లు తో చడం, ఆకాశజలం వంటివి పంచీకరణకు ఉదాహరణ. అదేవిధంగా మానవ దేహం కూడా పంచభూతాత్మకమే. మనం వ్యక్తిగతంగా, సమష్ఠి గా చేసే కర్మలను బట్టి దైవమే పంచభూతాల ద్వారా ఆయా కర్మ ఫలాలను అందిస్తాడు. అం దుచేతనే పంచభూతా త్మకమైన మానవుడు మంచి విషయాలకు పంచభూతాలను సాక్షులుగా తీసుకుంటాడు.

శరీరమే పంచభూతాలమయం..
4elementsఅసలు మన శరీరమే ఈ పంచభూ తాలతో నిర్మితమైనది. ఈ పూజ్యభా వంతోనే మన ఋషీశ్వరులు నేలను భూమాత అన్నారు. నీటిని గంగాదేవి గా కొలిచారు. అలాగే అగ్నిహోత్రుడి నీ, వాయుదేవుడినీ, ఆకాశాన్నీ ప్రత్య క్ష దైవాలుగా సంభావించారు. ఈ పంచభూతాలు ఇంత పవిత్రమై నవి కాబట్టే వివాహంలో నూతన వ ధూవరులు ‘మనమిద్దరమూ ఇలాగే జీవితాంతమూ కలిసి మెలిసి నడు ద్దాం!’ అని అగ్నిహోత్రం చుట్టూ ప్రద క్షిణలు చేస్తుంటారు. ‘మా ఇంటికి కోడలుగా వస్తున్న ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకొంటాం!’ అని జల రూపమైన పాలతో ప్రమాణం చేస్తుం టారు. ఏదైనా సందర్భంలో సత్య నిరూపణ చేసుకోవలసి వచ్చినప్పుడు ‘భూదేవి తోడు’ అంటుం టారు. తగాదాపడిన ఉభయ పక్షాల్లో ఒకపక్షంవా రు దేవాలయంలో దీపారాధన చేస్తే, మరొకరు ఆ దీపాన్ని ఆర్పి ప్రమాణం చేయటం మనం చూస్తూ ఉంటాం.

పంచభూతాలను తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు
‘నీ వెవరివో నాకు తెలియదు. వెళ్లిపో!’ అన్న దుష్యంతునితో శకుంతల ‘విమలయశోనిధీ! పురుష వృత్త మెఱుంగుచు నుండు జూవె వేదములును పంచభూత ములు...’ (భారతం, ఆదిపర్వం, 4-80)- ‘మన ఇద్దరికీ వివాహం జరిగిన విషయం పంచ భూతాలకు తెలుసు’ అన్నది. పూర్వం ఒక గురువు తన శిష్యలను పిలిచి తలా ఒక అరటి పండునిచ్చి ‘అబ్బాయిలూ! ఎవ్వరూ చూడకుండా, ఎవ్వరి కంట పడకుండా వీటిని తిని రండిరా!’ అన్నాడు. ఒకడు గురుకులంలోనికి వెళ్లి తలుపులు బిడాయించు కొన్నాడు. మరొకడు నిండా దుప్పటి కప్పుకొన్నాడు. అలాగే మరికొంత మంది. అందరూ అరటిపండ్లు తిని వచ్చేశారు. ఒక్కడు మాత్రం తినకుం డానే వచ్చి ‘ఎవ్వరూ చూడకుండా తినటం నావల్ల కా లేదండీ!’ అంటూ పండును గురువుేక తిరిగి ఇచ్చివేశాడు.

‘ఎందుకురా?’ అన్నాడు గురువు. ‘ఎక్కడికి వెళ్లినా నేల, గాలి, ఆకాశం ఉన్నాయండీ వాటి కంట పడకుండా తినలేకపోయానండీ!’ అన్నాడు వినయంగా. మనం మంచివి కానివ్వండి, చెడువి కానివ్వండి- ఏ పనులు చేస్తున్నప్పటికీ ‘ఎవ్వరూ చూడటం లేదులే!’ అనుకోవటం పొరపాటు. సాటి మనుషలు, అధికారులు, రక్షకభటులు మొదలైన వాళ్లు చూడకపోవచ్చు. పంచభూతాలు చూస్తూనే ఉంటాయి. వాటి కళ్లుకప్పటం మన తరం కాదు. మనం చేసే ప్రతిపనికీ అవి ప్రత్యక్ష సాక్షులు. అందుకే పంచభూతాల పట్ల ప్రతి వ్యక్తి భక్తిశ్రద్ధలు కలిగివుండా లి. అవే మనుకు ప్రత్యక్ష దైవాలు.

12, జులై 2011, మంగళవారం

గాయత్రి మంత్ర అంతరార్ధం

గాయత్రి మంత్ర అంతరార్ధం
gayatriఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం...భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌ న గాయత్య్రాః పరం మంత్రం నమాతు: పరదైవతం అన్నది జగత్ప్రసిద్ధమయిన వచనం ఈ గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లి ని మించిన దైవం లేదు. ఆదిశంకరాచార్యులు తమ భాష్యంలో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ అని పేర్కొన్నారు. గయలు అంటే ప్రాణములు అని అర్ధం. అ లాగే త్రాయతే అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయ త్రి మంత్రమని శంకర భాష్యం.ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్క గా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ.

రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రా క్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వి తమెనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుం ది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన. ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం ఇలా చెబుతారు.

ఓం - భగవంతుడు సర్వ రక్షకుడు.
భూర్‌ - ఉనికి కలిగినవాడు
భువః - జ్ఞాన రూపుడు
స్వః - ఆనంద స్వరూపుడు అంటే దుఖః రహితుడు
తత్‌ - అటువంటి లక్షణాలు కలిగిన పరమేశ్వరుడు
సవితు - ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త
వరేణ్యం - అందరితో ఆరాధింపబడేవాడు
భర్గః - పరిశుద్ధుడు
దేవస్యః - ఆవిధమయిన దివ్య గుణములు కలిగిన దైవ స్వరూపుడు
ధీమహి - ఆత్మలో ఏకమయిన
ధియః - ఆ పరమేశ్వరుడు
‚నః - మా బుద్ధులను
ప్రచోదయాత్‌ -సత్కర్మలలో ప్రేరేపించి శ్రేయస్సు పొందేవిదంగా సమర్ధులను చేయుగాక.ఇక మూలార్ధం తీసుకుంటే దాని భావం ఇలా వుంటుంది.ఓ భగవాన్‌!ఏకకాలంలో సమస్త ప్రదేశాలలో వుండగలిగిన ఓ విశ్వరూపీ! అపరిమితమయిన శక్తికలిగిన ధీశాలీ! పరమేశ్వరా!ఈ చరాచర ప్రపంచంలో లభ్యమయ్యే సమస్త జ్ఞానం నువ్వే. సర్వ ప్రకాశానివి నువ్వే. వర్రపదాతవు నువ్వే. మాలో భయాన్ని పోగొట్టేది నువ్వే. ఈ విశ్వానికి సృష్టికర్తవు నువ్వే. సర్వోత్తముడివి నువ్వే. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ము. మా మనస్సు, మేధస్సు సత్కర్మలవైపు ఆకర్షించబడేలా చూస్తూ సన్మార్గంలో నడిచేలా మాకు మార్గం చూపు.గాయత్రి మంత్రాన్ని శాస్ర్తీయ కోణం నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదా యిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్ర్తీయ ప్రా ధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి.ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాల పుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవ యిన లక్షల నక్షత్రాలు వున్నాయి.

ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్ష త్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడి తో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుం బంలోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్థానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్‌ ల ల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతు న్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్ర్తీయ కోణం నుంచి పరిశీలిద్దాం. ఓం భూర్భు వస్వః - భూర్‌ అంటే భూమి, భువః అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రా లతో కూడిన పాలపుంత (గెలాక్సీ)

ఇక్కడ ఓ చిన్న వివరణ మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్‌ ఫాన్‌ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతా యి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతు లేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుం దన్నది ఊహాతీతం.గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః అనే ఈ బీజాక్షరాలు ఈ చరా చర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓం కారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి.

సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునుల కు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వా రందరూ కలసి ఈ ధ్వనికి ఓం అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.కాబట్టి నిరాకారుడు, నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరి గిందని విశ్వాసుల నమ్మకం. అప్పటి దాకా భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.

గీతాకారుడు కూడా అదే చెప్పాడు. ఓం ఏకాక్షరం బ్రహ్మ అం టే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం. అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టా రు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట. ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటం టే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరి భ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి కైనెటిక్‌ ఎనర్జీని ఉత్పత్తి చేస్తు న్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వంలోని గ్రహరాసుల న్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతు ల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తి చేసే ఎనర్జీకి స్టోర్‌ హౌస్‌ వంటిదన్నమాట.

తత్స వితుర్వరేణ్యం...తత్‌ అంటే ఆ (భగవంతుడు) సవితుర్‌ అంటే సూర్యుడు (న త్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగి వుండడం. ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే ఫలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలియడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడి ని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వా మిత్ర మహర్షి వాక్రుచ్చాడు.ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్ష త్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయి న భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.ఇది ఎలా అంటే- ఒక గణిత శాస్తజ్ఞ్రుడు 2+2=4; =2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్‌ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు. విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే.

గాయత్రి మంత్రంలోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు. భర్గో దేవస్య ధీమహిభర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం. అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారు డయిన భగవంతుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ దేవుడిని పూ జించాలని కూడా ఆయన చెప్పారు.ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పు డూ చంచలంగా వుండే మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు. దియోయోనః ప్రచోదయాత్‌ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్ర చోదయాత్‌ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగ వంతుడా! సరయిన మార్గంలో నడిచే విధంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.

ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్ర్తీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.భూమి(భుర్‌) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమిత మయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయి న భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్‌) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్‌) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు.కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో)ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనా దంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్‌) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.
ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః రిగ్వేద(అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)